ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియుడితో కలిసి అర్ధరాత్రి భర్తను చంపిన భార్య.. చాటుగా చూసిన 13 ఏళ్ల కూతురు.. 15 రోజుల తర్వాత..

ABN, First Publish Date - 2021-07-26T20:31:13+05:30

కట్టుకున్న భార్యే అతని పట్ల యమదూతలా మారింది. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన భర్తను ఆప్యాయంగా ఆహ్వానించాల్సిందిపోయి ప్రియుడితో కలిసి పరలోకానికి పంపేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కట్టుకున్న భార్యే అతని పట్ల యమదూతలా మారింది. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన భర్తను ఆప్యాయంగా ఆహ్వానించాల్సిందిపోయి ప్రియుడితో కలిసి పరలోకానికి పంపేసింది. ఈ ఘోరం జార్ఖండ్‌లోని దుమ్కాలో వెలుగు చూసింది. అయితే ఆ భార్య చేసిన ఘోరాన్ని ఆమె కుమార్తె చూడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌కు చెందిన సోనూ పోద్దార్ (36) గుజరాత్‌లో పని చేస్తుండేవాడు. ఆ సమయంలోనే అతని భార్య గౌరీకి ఊళ్లో ఉన్న వేరే వ్యక్తితో పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా అక్రమ సంబంధం ఏర్పడింది. ఇలాంటి సమయంలో పదిహేను రోజుల క్రితం సోనూ స్వగ్రామానికి తిరిగొచ్చాడు. దీంతో వీరిద్దరికీ అతను అడ్డుగా కనిపించాడు. సోనూ అడ్డు తొలగించాలని పథకం వేశారు.


పథకం ప్రకారం సోనూను ఇద్దరూ కలిసి హత్యచేశారు. ఆపై ఎవరికీ అనుమానం రాకూడదని అతని శరీరాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. అయితే తల్లి చేసిన ఘాతుకాన్ని ఆమె పదమూడేళ్ల కుమార్తె కిటికీలోంచి చూసింది. జరిగిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ కూతుర్నే బెదిరించిందా తల్లి. దీంతో భయపడిన ఆ అమ్మాయి నోరుమెదపలేదు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆ బాలిక తన స్నేహితురాలితో మాట్లాడుతుండగా.. తండ్రి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆమె తాను చూసిన దారుణాన్ని స్నేహితురాలికి చెప్పింది. ఇలా ఆ నిజం గ్రామస్థులందరికీ తెలిసింది. దీంతో వాళ్లలో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అయితే వీటిని గాలివార్తలుగా భావించిన పోలీసులు దర్యాప్తు చేయలేదు. అయితే గురువారం నాడు గ్రామీణులంతా గుంపుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఈ కేసుపై దర్యాప్తు చేయాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గౌరీని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల ఒత్తిడికి తలొగ్గిన ఈ జంట అసలు నిజం చెప్పేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు సెప్టిక్ ట్యాంకు నుంచి సోనూ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు.

Updated Date - 2021-07-26T20:31:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising