ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థాయ్‌ల్యాండ్‌ మహిళ.. భారత్‌లో కొవిడ్‌తో మృతి

ABN, First Publish Date - 2021-05-10T14:08:34+05:30

థాయ్‌ల్యాండ్‌ మహిళ.. భారత్‌లో కొవిడ్‌తో మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారం చేసిన పోలీసులు

లక్నో, మే 9: థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ.. భారత్‌లో మరణించడం వివాదాస్పదంగా మారింది. స్థానిక రాజకీయాల్లో కలకలం రేపింది. 41 ఏళ్ల ఆ మహిళ.. ఏప్రిల్‌ 28న టూరిస్టు వీసాపై ఉత్తరప్రదేశ్‌లోని లక్నో చేరుకున్నారు. ఇక్కడకు వచ్చిన రోజుల వ్యవధిలోనే ఆమె కరోనా బారినపడ్డారు. అనంతరం లక్నోలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ మే 3న మరణించారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె అసలు భారత్‌కు ఎందుకు వచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు గైడ్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులు వీక్షించేందుకు వీలుగా అంత్యక్రియలను పోలీసులు ప్రత్యక్షప్రసారం చేశారు. కాగా, ఆమెను భారత్‌ రప్పించింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీ కుమారుడని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపిస్తోంది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తోంది. 


Updated Date - 2021-05-10T14:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising