ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో కారు డ్రైవింగ్‌ చేసి.. తెలుగు NRI కుమారుడ్ని బలిగొన్న అమెరికన్ మహిళ!

ABN, First Publish Date - 2021-12-21T12:52:06+05:30

అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి, రజనీరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వారి కుమారుడు అర్జిత్‌రెడ్డి(13) మృతి చెందగా.. కుమార్తె అక్షితారెడ్డి(15) ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. రాంచంద్రారెడ్డి పదహారేళ్ల క్రితం అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా స్థిరపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలో కారు ప్రమాదంలో జనగామ జిల్లా ఎన్నారై కుమారుడి మృతి

లింగాలఘణపురం, డిసెంబరు 20: అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి, రజనీరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వారి కుమారుడు అర్జిత్‌రెడ్డి(13) మృతి చెందగా.. కుమార్తె అక్షితారెడ్డి(15) ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. రాంచంద్రారెడ్డి పదహారేళ్ల క్రితం అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా స్థిరపడ్డారు. ఆదివారం రాత్రి స్నేహితుడి జన్మదిన వేడుకలకు భార్య రజనీరెడ్డి, పిల్లలతో కలిసి కారులో వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తూ.. లాస్‌ఏంజిల్స్‌లోని ఓ కూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద కారును ఆపారు. ఓ మహిళ మద్యం మత్తులో కారు డ్రైవింగ్‌ చేస్తూ.. వారి కారును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెనుక సీట్లో కూర్చున్న కుమారుడు అర్జిత్‌రెడ్డి అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. రామచంద్రారెడ్డి, రజనీరెడ్డి, అక్షితారెడ్డి చికిత్స పొందుతున్నారని బంధువులు తెలిపారు.

Updated Date - 2021-12-21T12:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising