ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TANA ప్రపంచ సాహిత్య వేదిక “రాజకీయ నాయకుల సాహిత్య కోణం” విజయవంతం

ABN, First Publish Date - 2021-12-03T19:13:43+05:30

తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెన్నెల” నవంబర్ 28న జరిగిన 21వ అంతర్జాల సాహిత్య సదస్సులో “రాజకీయ నాయకుల సాహిత్య కోణం” అనే అంశంపై జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అట్లాంటా, జార్జియా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెన్నెల” నవంబర్ 28న జరిగిన 21వ అంతర్జాల సాహిత్య సదస్సులో “రాజకీయ నాయకుల సాహిత్య కోణం” అనే అంశంపై జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం కావడంలో కృషి చేసిన కార్యకర్తలందరికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.  


తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రస్తుత కలుషిత రాజకీయ పరిస్ధితులలో ‘న బూతో న భవిష్యతి’ అన్న చందంగా రాజకీయ నాయకులు ఒకరిని మించి ఒకరు బూతులు మాట్లడంలో పోటీ పడుతున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొని ఎటువంటి రాజకీయాలు మాట్లాడకుండా కేవలం తెలుగు సాహిత్యంపై క్లుప్తంగా ప్రసంగాలు చెయ్యడం “న భూతో న భవిష్యతి” అన్నారు.   


ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి; షేక్ హుస్సేన్ సత్యాగ్ని,ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనమండలి సభ్యులు, నాటక/కథా రచయిత; డా. కంకణాల నారాయణ,సి.పి.ఐ జాతీయ కార్యదర్శి; డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (వై. ఎస్.ఆర్.సి.పి); బి.వి రాఘవులు,సీపీఐ (ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు; ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర),బీజేపీ (ఆం.ప్ర) అధికార ప్రతినిధి, ప్రముఖ కథా/నవలా రచయిత; డా. నర్రెడ్డి తులసి రెడ్డి,ఎం.బి.బి.ఎస్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు; ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ, మాజీ మంత్రివర్యులు, పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణా పీసీసీ తొలి అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు విశిష్ఠ అతిధులుగా పాల్గొని వివిధ సాహిత్య అంశాలపై అద్భుతంగా ప్రసంగించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. 


తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో ఒడుదుడుకులు, ఉద్యమాలతో పెనవేసుకుపోయిన రాజకీయ నాయకుల జీవితాలలో సాహిత్యం, కళలు అంతర్భాగమని, ఈ కార్యక్రమంలో ఇంతమంది రాజకీయ నాయకులు పాల్గొని సాహిత్య సమాలోచన చెయ్యడం చూడముచ్చటగా ఉందన్నారు. సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయంగా నమోదు అయ్యింది అని పేర్కొన్నారు. పూర్తి కార్యక్రమాన్ని https://www.youtube.com/watch?v=bfpZaE1vGsc లింక్‌లో చూడవచ్చు. 







Updated Date - 2021-12-03T19:13:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising