ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తానా ఆధ్వర్యంలో ‘తెలుగు దిన పత్రికలు-తెలుగు భాష ప్రామాణికత’పై చర్చాగోష్టి

ABN, First Publish Date - 2021-04-26T17:23:14+05:30

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ఇంటర్నెట్ వేదికగా ‘తెలుగు దినపత్రికలు-తెలుగు భాష ప్రమాణికత’ అనే అంశంపై జరిపిన చర్చా కార్యక్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ఇంటర్నెట్ వేదికగా ‘తెలుగు దినపత్రికలు-తెలుగు భాష ప్రమాణికత’ అనే అంశంపై జరిపిన చర్చా కార్యక్రమం విజయవంతం అయింది. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ప్రారంభోపన్యాసం చేశారు. ‘తెలుగు భాషను పరిరక్షించుకోవటానికి పత్రికలు చేస్తున్నకృషి ఎంతో శ్లాఘనీయమైదని, తెలుగు భాషా సాహిత్యాల కోసం తానా నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.


తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రయోజనమైన చర్చగా దీన్ని అభివర్ణించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ‘భాషా పరిపుష్టి కోసం తెలుగు పత్రికలు నిర్వహించిన, నిర్వహిస్తున్న పాత్ర గురుతరమైంది. అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైన, అనుసరించదగ్గ, జన హాహుళ్యంలోకి ఎక్కువగా వెళ్లే తెలుగు పదా సృష్టి జరగవలిసిన అవసరం ఉంది. ఈ కృషిలో ప్రభుత్వాలు, తెలుగు అకాడమీలు, సాహిత్య అకాడమీలు ఎక్కువ దృష్టి పెట్టాలి. వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తెలుగు దినపత్రికలు అత్యంత ప్రతిభావంతమైన పాత్రను పోషిస్తాయి’ అన్నారు. అందుకే ‘తెలుగు దినపత్రికలు-తెలుగు భాష ప్రామాణికత’ అనే అంశంపై తమ విశేష అనుభవాలను అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా పలు దిన పత్రికల సంపాదకులను కోరినట్టు చెప్పారు. దీనికి అందరూ అంగీకారం తెలిపి.. ఒకే వేధికమీదకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. 



ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న ‘మన తెలంగాణ’ దినపత్రిక సంపాదకులు గార శ్రీరామమూర్తి ప్రసంగిస్తూ..‘కొత్త పదాలను సృష్టించే క్రమంలో వాటిని సంక్షిష్టం చేయడం మంచిది కాదు, దాని వల్ల భాష జనానికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ మంది వాడే పదాలను పత్రికలు వాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు. ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వ్యవస్థాపకులు సతీష్ చందర్ మాట్లాడుతూ ‘భాషలో ఎదిగి, ఒదిగి మాట్లాడటం ఉంటాయి. ఇతర భాషల్లోని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పదాలకు భాషా వేత్తలు కొత్త పదాలను సృష్టించలేరు. ఆ సంకేతిక రంగల్లో ఉన్న వారు మాత్రమే ఈ పదాలను సృష్టించగలరు’ అన్నారు. 


ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కే.శ్రీనివాస్ మాట్లాడుతూ ‘వాడుక భాష వేరు, శాస్త్రవిజ్ఞాన భాష వేరు. వాడుక భాష ప్రమాణిక భాష కాలేదు. అచ్చ తెలుగు మాటలతో ప్రమాణికతను సాధించలేము. ఒక కొత్త పదానికి అర్థం నిఘంటువులో లేకపోతే దానికి ప్రమాణిక లేనట్టే అనుకోవాలి. అందువల్లే నిఘంటువు నిర్మాణాలు విరివిగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అన్నారు. ఈనాడు దినపత్రిక సంపాదకులు ఎం. నాగేశ్వరావు ప్రసంగిస్తూ ‘మాతృభాషలో పిల్లలకు పునాదులు వేయాల్సిన అవసరం ఉంది. భారతీయ భాషలు అనేకం హజంత భాషలు. తెలగు హజంత భాష. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పదాలను రామోజీ ఫౌండేషన్ ద్వారా సృష్టిస్తున్నాం’ అన్నారు. 


సాక్షి దినపత్రిక సంపాదకులు దిలీప్ రెడ్డి మాట్లాడుతూ ‘ప్రసార మాద్యమాల్లో లక్ష్యాలు సాధించాలంటే ప్రమాణిక భాష ఉండాలి. ప్రమాణిక భాష ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎక్కువ మంది అంగీకరించిన భాష ప్రమాణిక భాష అవుతుంది. పత్రికలు భాషను నిరంతరం కాపాడుతూ వస్తున్నాయి’ అన్నారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భాషా పరిరక్షణ కోసం ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు జరుపుతామని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-26T17:23:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising