ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait లో షాకింగ్ ఘటన.. ఐదేళ్లుగా కూతురి శవాన్ని బాత్‌రూంలో దాచిపెట్టిన తల్లి..!

ABN, First Publish Date - 2021-10-27T21:04:05+05:30

గల్ఫ్ దేశం కువైత్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలు ఐదేళ్ల క్రితం చనిపోయిన తన కూతురి మృతదేహాన్ని బాత్‌రూంలో దాచిపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలు ఐదేళ్ల క్రితం చనిపోయిన తన కూతురి మృతదేహాన్ని బాత్‌రూంలో దాచిపెట్టింది. చివరకు ఆమె కుమారుడి ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది. అసలు ఆమె ఎందుకిలా చేసింది? ఆమె కుమార్తె ఎలా చనిపోయింది? అనే విషయాలను తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. కువైత్‌లోని సాల్మియా ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. 2016లో చనిపోయిన తన చెల్లి శవాన్ని తన తల్లి బాత్‌రూంలో దాచిపెట్టిందని 60 ఏళ్ల వృద్ధురాలి కుమారుడు తాజాగా అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.


అతడి ఫిర్యాదుతో అధికారులు వెంటనే ముసలావిడా ఇంటికి వెళ్లారు. కూతురు మృతదేహాన్ని దాచి ఉంచిన బాత్‌రూం తలుపులు తెరిపించారు. అక్కడ వారికి చనిపోయిన యువతి అస్తిపంజరం మాత్రమే కనిపించింది. మృతిచెంది ఐదేళ్లు కావొస్తుండడంతో కేవలం ఎముకలు మాత్రమే దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఫోరెన్సిక్‌కు పంపించారు. అసలు ఆ యువతి మరణానికి కారణం ఏంటనేది ఫోరెన్సిక్ నివేదిక వస్తేగానీ తెలియదని అధికారులు తెలిపారు. మరోవైపు పోలీసులు వృద్ధురాలితో పాటు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 


ఈ విచారణలో కూతురు తన మాట వినకపోవడంతో బాత్‌రూంలో పెట్టి కొన్ని రోజులు అందులోనే ఉంచానని వృద్ధురాలు తెలియజేసింది. ఆమెను బయటకు తీయకుండా అందులోనే ఆహారం, నీరు అందించినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఒకరోజు తన కూతురు చనిపోయిందని, ఈ విషయం బయటకు తెలిస్తే ప్రమాదమని భావించి అదే బాత్‌రూంలో ఉంచేసినట్లు చెప్పుకొచ్చింది. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. అయితే, ఈ విషయం ఎప్పటికైనా బయటపడితే తనకు కూడా ప్రమాదమని భావించిన ముసలావిడా కుమారుడు తాజాగా అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులకు ఈ ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఇతర వివరాల కోసం ప్రస్తుతం తల్లి, కొడుకును పోలీసులు విచారిస్తున్నారు.   

Updated Date - 2021-10-27T21:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising