75th Independence Day: భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ రూలర్స్!
ABN, First Publish Date - 2021-08-15T13:50:23+05:30
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, భారత ప్రజలకు సౌదీ అరేబియా రూలర్స్ శుభాకాంక్షలు తెలియజేశారు.
రియాద్: 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, భారత ప్రజలకు సౌదీ అరేబియా రూలర్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. సౌదీ రూలర్ కింగ్ సల్మాన్తో పాటు క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాని, డిఫెన్స్ మినిస్టర్ మహ్మద్ బిన్ సల్మాన్ ఇలా ప్రత్యేకంగా ఇండిపెండెంట్స్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా సౌదీ రూలర్స్ రాష్ట్రపతికి ఓ సందేశం పంపించారు. రామ్నాథ్ కోవింద్ ఆయురారోగ్యాలతో ఉండాలని, భారత ప్రజలు సుఖ:సంతోషాలతో విరాజిల్లాలని వారు కోరారు. అలాగే భారతదేశం మరింత ప్రగతిని సాధించాలని వారు ఆకాంక్షించారు.
Updated Date - 2021-08-15T13:50:23+05:30 IST