గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనా?
ABN, First Publish Date - 2021-04-17T10:50:15+05:30
ఎప్పటినుంచో ఎన్నో కథలూ గాథలుగా, చిత్రాలుగా ప్రచారంలో ఉన్న గ్రహాంతర వాసుల ఉనికిని ఇపుడు నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రెండేళ్ల కిందట అమెరికా నౌకాదళం ఓ మూడు ఎగిరే వస్తువులను గుర్తించి
2019లో యూఎఫ్వోలను ఫోటో తీసిన అమెరికా నౌకాదళం
తాజాగా దాన్ని ధ్రువీకరించిన పెంటగాన్
వాషింగ్టన్, ఏప్రిల్ 16: ఎప్పటినుంచో ఎన్నో కథలూ గాథలుగా, చిత్రాలుగా ప్రచారంలో ఉన్న గ్రహాంతర వాసుల ఉనికిని ఇపుడు నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రెండేళ్ల కిందట అమెరికా నౌకాదళం ఓ మూడు ఎగిరే వస్తువులను గుర్తించి వాటి ఫోటోలను, వీడియోలను చిత్రీకరించింది. ఇన్నాళ్లూ వీటి గురించి రహస్యంగా ఉంచింది. ఫోటోలు లీకయినప్పటికీ ఆ విషయం గురించి మాట్లాడలేదు. తాజాగా పెంటగాన్.. గుర్తుతెలియని మూడు ఎగిరే వస్తువులను (యూఎ్ఫవోలను) ఫోటో, వీడియో తీసిన మాట నిజమేనని ధ్రువీకరించింది. గుండ్రంగా ఉన్నదొకటి, పిరమిడ్ ఆకృతిలో ఓ కాయలా ఉన్నదొకటి, త్రిభుజాకృతిలో మరొకటి ఆ యూఎ్ఫవోలు మేఘాల మధ్య వెళుతూండగా వీడియో తీసినట్లు పెంటగాన్ ప్రతినిధి సూ గఫ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2021-04-17T10:50:15+05:30 IST