ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఐదు దేశాల ప్రయాణికులకు Dubai విమానాల్లో నో ఎంట్రీ.. కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2021-09-02T15:40:27+05:30

దుబాయ్ వచ్చే ఐదు దేశాల ప్రయాణికులకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ షాక్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: దుబాయ్ వచ్చే ఐదు దేశాల ప్రయాణికులకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ షాక్ ఇచ్చింది. విమానాశ్రయాల వద్ద ర్యాపిడ్ పీసీఆర్ టెస్టు సౌకర్యం లేకపోవడంతో బంగ్లాదేశ్, నైజీరియా, వియత్నాం, జాంబియా, ఇండోనేషియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు దుబాయ్ విమానాల్లోకి ప్రవేశం లేదని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు సదరు ఎయిర్‌లైన తమ అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా ట్రావెల్ అప్‌డేట్‌ను పొందుపరిచింది. "బంగ్లాదేశ్, నైజీరియా, వియత్నాం, జాంబియా, ఇండోనేషియా దేశాల ఎయిర్‌పోర్టుల్లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్టింగ్ సౌకర్యం లేనందున ఆయా దేశాల ప్రయాణికులకు దుబాయ్ విమానాల్లో ఎంట్రీ లేదు" అని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రత్యేక ప్రకటన చేసింది. 


అయితే, ఎమిరేట్స్ జారీ చేసిన ప్రయాణ మార్గదర్శకాలను పాటిస్తే ఈ ఐదు దేశాల ప్రయాణికులకు దుబాయ్ వచ్చేందుకు వీలు కల్పిస్తామని పేర్కొంది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ దేశాల నుంచి దుబాయ్‌కు భారీ మొత్తంలో ప్రయాణికులు వెళ్తున్నట్లు సమాచారం. దీంతో ఈ దేశాల విమానాల టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని కేరళ, ముంబై, ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లే విమానాల టికెట్ల రేట్లు భారీగా పెరిగిపోయాయని తెలుస్తోంది. 

Updated Date - 2021-09-02T15:40:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising