ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత ప్రయాణికులపై నిషేధాన్ని పొడిగించిన ఒమన్!

ABN, First Publish Date - 2021-05-05T17:56:37+05:30

కరోనా సెకండ్ వేవ్‌తో భారత్‌ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశం ఒమన్ మరోసారి భారత్ ప్రయాణికులపై నిషేధాన్ని పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: కరోనా సెకండ్ వేవ్‌తో భారత్‌ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశం ఒమన్ మరోసారి భారత్ ప్రయాణికులపై నిషేధాన్ని పొడిగించింది. ఈ మేరకు ఆ దేశ సుప్రీం కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 7వ తేదీ(శుక్రవారం) నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తోందని సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని కమిటీ పేర్కొంది. భారత్‌తో పాటు సుడాన్, లెబనాన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, నైజీరియా, టాంజానియా, ఘనా, గినియా, సియెర్రా లియోన్, ఇథియోపియా, బ్రిటన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ ప్రయాణికులపై కూడా ఒమన్ బ్యాన్ విధించింది. అలాగే ఈ దేశాల మీదుగా ప్రయాణించే వారికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా, ఒమన్ పౌరులు, దౌత్య వేత్తలు, హెల్త్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది.  


Updated Date - 2021-05-05T17:56:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising