ఎన్నారైలకు పాస్పోర్టుతో ‘ధరణి’ పాస్బుక్
ABN, First Publish Date - 2021-01-22T12:46:58+05:30
పాస్పోర్టు ఆధారంగా ఎన్నారైలు పాసుబుక్కులను పొందే ఆప్షన్ను ధరణి పోర్టల్లో అందుబాటులోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పాస్పోర్టు ఆధారంగా ఎన్నారైలు పాసుబుక్కులను పొందే ఆప్షన్ను ధరణి పోర్టల్లో అందుబాటులోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. 2017లో భూ రికార్డుల నవీకరణ జరిగినప్పుడు ఆధార్ లేదనే కారణంతో ప్రవాస భారతీయులకు పాస్ బుక్కును ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. ఇటీవలే పాస్ పోర్టు ఆధారంగా పాస్బుక్కులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్లో పాస్పోర్టు ఆధారంగా పాస్బుక్కులకోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి, పాస్బుక్కుల జారీకి ఆమోదం తెలుపుతారు.
Updated Date - 2021-01-22T12:46:58+05:30 IST