ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దళిత బంధు' పథకంపై ఎన్నారైల హర్షం

ABN, First Publish Date - 2021-07-20T00:05:04+05:30

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘దళిత బంధు’ పథకంపట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘దళిత బంధు’ పథకంపట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రూ.1200 కోట్లతో దళిత బంధు పథకం ప్రారంభం కానుందనీ.. మొద‌టి ద‌శ‌లో ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 11,900 కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించనున్నట్టు ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 



కాగా.. దళితుల సాధికారత కోసం తెచ్చిన ‘దళిత బంధు' పథకంపట్ల ఎన్నారైలంతా హర్షిస్తున్నారని చెప్పారు. పేదలు, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధి‌తో కృషి చేస్తున్న నాయకుడు కేసీఆరే అని ఎన్నారైలంతా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని ఆరోపించారు. దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన అందరిపై ఉందని అభిప్రాయపడ్డారు.  


Updated Date - 2021-07-20T00:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising