కాణిపాకం వినాయకుడికి ఎన్నారై భారీ విరాళం!
ABN, First Publish Date - 2021-02-28T13:24:34+05:30
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్లు విరాళంగా అందించినట్లు ఆలయ ఈవో వెంకటేశు శనివారం తెలిపారు.
ఐరాల(కాణిపాకం): చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్లు విరాళంగా అందించినట్లు ఆలయ ఈవో వెంకటేశు శనివారం తెలిపారు. స్వామి వారి ఆలయ విస్తరణ పనుల కోసం ప్రవాస భారతీయుడైన ఓ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్ల చెక్ను అందించారని ఈవో పేర్కొన్నారు. కాగా, ఆలయ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో నగదు విరాళంగా భక్తుడు అందించడం అనేది ఇదే తొలిసారి అని కూడా వెంకటేశు తెలిపారు.
Updated Date - 2021-02-28T13:24:34+05:30 IST