అమెరికాలో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. 20కోట్ల మందికి కొవిడ్ టీకా!
ABN, First Publish Date - 2021-04-17T21:07:54+05:30
అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 20 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ను ఇచ్చినట్టు అమెరికా ప్రకటించింది. అమెరికాలో శుక్రవారం నాటికి 20 కోట్ల మంది ప్రజలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 20 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ను ఇచ్చినట్టు అమెరికా ప్రకటించింది. అమెరికాలో శుక్రవారం నాటికి 20 కోట్ల మంది ప్రజలు కొవిడ్ టీకాను అందుకున్నారని సీడీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో దాదాపు 8కోట్ల మందికిపైగా ప్రజలు టీకా రెండు డోసులను తీసుకోగా.. మిగిలిన వారు మొదటి డోసు తీసుకున్నట్టు వివరించింది. అంతేకాకుండా.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న టీకా కేంద్రాలకు 25.8కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసున్నట్టు వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా అమెరికాలోని ప్రజలకు మోడెర్నా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను అందిస్తున్నట్టు సీడీసీ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. వరల్డ్ఒమీటర్లోని సమారం ప్రకారం గడిచిన 24 గంటల్లో అమెరికాలో 80వేల కరోనా కేసులు నమోదవ్వగా దాదాపు 900 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు అమెరికాలో నమోదైన కేసుల సంఖ్య 3.23కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 5.80లక్షలకు చేరింది.
Updated Date - 2021-04-17T21:07:54+05:30 IST