ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూజిలాండ్‌లో పదోన్నతి పొందిన భారత సంతతి మహిళ!

ABN, First Publish Date - 2021-03-07T01:39:22+05:30

న్యూజిలాండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న భారత సంతతికి చెందిన మహిళకు పదోన్నతి లభించింది. కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మన్‌దీప్ కౌర్ సింధూ.. సీనియర్ సార్జెంట్‌గా పదోన్నతి పొం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న భారత సంతతికి చెందిన మహిళకు పదోన్నతి లభించింది. కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మన్‌దీప్ కౌర్ సింధూ..  సీనియర్ సార్జెంట్‌గా పదోన్నతి పొందారు. న్యూజిలాండ్ పోలీస్ కమిషనర్ ఆండ్రూ కోస్టర్.. ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించి.. అందుకు సంబంధించిన బ్యాడ్జ్‌ను మన్‌దీప్ కౌర్ సింధూకు అందించారు. కాగా.. పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ కౌర్ సింధూ.. 2004లో న్యూజిలాండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. దీంతో న్యూజిలాండ్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన తొలి భారత సంతతి మహిళ‌గా ఆమె గుర్తింపు పొందారు. గతంలో ఆమె న్యూజిలాండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని పలు విభాగాల్లో పని చేశారు. ఈ సందర్భంగా మన్‌దీప్ కౌర్ సింధూ మాట్లాడుతూ..పోలీస్ ఉద్యోగంపై చిన్నతనం నుంచే ఇష్టాన్ని పెంచుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో కష్టపడి ఉద్యోగాన్ని పొందినట్టు చెప్పారు. 


Updated Date - 2021-03-07T01:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising