కువైత్లో విషాదం.. కేరళకు చెందిన గర్భిణీ మహిళ మృతి
ABN, First Publish Date - 2021-07-26T16:24:27+05:30
కువైత్లో విషాదం చోటు చేసుకుంది. కరోనా కాటుకు భారత్కు చెందిన గర్భిణీ మహిళ బలైంది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కువైత్లో సైతం కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ: కువైత్లో విషాదం చోటు చేసుకుంది. కరోనా కాటుకు భారత్కు చెందిన గర్భిణీ మహిళ బలైంది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కువైత్లో సైతం కొవిడ్ కేసులు బారీగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేరళలోని తిరువనంతపురానికి చెందిన సిని సంతోష్ (43) అనే గర్భిణీ మహిళ కొద్ది రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కడుపులో ఉన్న శిశువు ప్రాణాలను సైతం వైద్యులు రక్షించలేకపోయారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Updated Date - 2021-07-26T16:24:27+05:30 IST