ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లో అనుమానాస్పద స్థితిలో భారతీయుడు మృతి

ABN, First Publish Date - 2021-07-26T16:54:14+05:30

ఇండియాకు చెందిన వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కువైత్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన జగదీశ్ (44) గత కొన్నేళ్లుగా కువైత్‌లోని అమెరికా ఎంబసీ కార్యా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇండియాకు చెందిన వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కువైత్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన జగదీశ్ (44) గత కొన్నేళ్లుగా కువైత్‌లోని అమెరికా ఎంబసీ కార్యాలయం వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వరిస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం రోజు కూడా విధులకు హాజరైన ఆయన.. బాత్‌రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించాడు. దీంతో ఎంబసీ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తుపాకీ తూటా కారణంగా జగదీశ్ మరణించినట్టు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జగదీశ్ సర్వీస్ రివాల్వర్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేక ఎవరైనా ఆయనను హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2021-07-26T16:54:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising