నియామకాలపై కువైత్ PAM Acting DGతో భారత రాయబారి చర్చలు
ABN, First Publish Date - 2021-08-20T14:31:48+05:30
నియామకాల విషయమై భారత రాయబారి సీబీ జార్జ్ తాజాగా కువైత్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్(పీఏఎం) తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ముబారక్ అల్ ఆజ్మీతో భేటీ అయ్యారు.
కువైత్ సిటీ: నియామకాల విషయమై భారత రాయబారి సీబీ జార్జ్ తాజాగా కువైత్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్(పీఏఎం) తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ముబారక్ అల్ ఆజ్మీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీఏఎం డీజీతో గృహాకార్మికులు, నర్సుల నియామకాలపై రాయబారి చర్చించారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, కమ్యూనిటీ విషయాలను పెంచే మార్గాలపై కూడా చర్చించడం జరిగింది. అంతేగాక కువైత్లోని భారతీయ ఇంజనీర్ల సమస్యల పరిష్కారం దిశగా అల్ అజ్మీతో రాయబారి మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ కార్మిక రంగాలలో అందించిన సహాయానికి భారత్కు పీఏఎం తాత్కాలిక డైరెక్టర్ జనరల్ కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2021-08-20T14:31:48+05:30 IST