ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Emirates Airline: భారత్ సహా నాలుగు దేశాల విమాన సర్వీసులపై కీలక ప్రకటన!

ABN, First Publish Date - 2021-07-24T16:24:58+05:30

భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ విమాన సర్వీసులపై దుబాయ్‌కు చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తాజాగా కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ విమాన సర్వీసులపై దుబాయ్‌కు చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నాలుగు దేశాల నుంచి వచ్చే ప్యాసెంజర్ విమాన సర్వీసులపై జూలై 28 వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని శుక్రవారం ఎమిరేట్స్ ప్రకటించింది. అలాగే గత 14 రోజులుగా ఈ దేశాల ద్వారా కనెక్ట్ అయిన ప్రయాణీకులు మరే ఇతర ప్రదేశం నుండి యూఏఈకి ప్రయాణించడానికి వీల్లేదు. కాగా, యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, కరోనా నేపథ్యంలో ప్రత్యేక అనుమతి ఉన్నవారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంది. ఎమిరేట్స్‌తో పాటు ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ కూడా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విమాన సర్వీసులపై జూలై 31 వరకు సస్పెన్సన్ విధించినట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే.. యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) మాత్రం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక విమాన సర్వీసులపై విధించిన నిషేధం ఎప్పటివరకు కొనసాగుతుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.    

Updated Date - 2021-07-24T16:24:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising