ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఉమ్రా యాత్రికులకు బిగ్ రిలీఫ్!

ABN, First Publish Date - 2021-12-26T18:50:41+05:30

మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్ ఇప్పటికే 30కి పైగా దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. తాజాగా ఈ జాబితాలో సౌదీ అరేబియా చేరింది. దీంతో ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ విమాన సర్వీసులకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా 2022 జనవరి 1 నుంచి రెండు దేశాల మధ్య విమాన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్ ఇప్పటికే 30కి పైగా దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. తాజాగా ఈ జాబితాలో సౌదీ అరేబియా చేరింది. దీంతో ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ విమాన సర్వీసులకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా 2022 జనవరి 1 నుంచి రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని తన ట్వీట్‌లో పేర్కొంది. ఇక ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య పరిమిత సంఖ్యలో డైరెక్ట్ విమాన సర్వీసులు నడిపించుకునేందుకు వీలు ఉంటుంది. కొన్ని ప్రత్యేక నిబంధనల మధ్య ఇరు దేశాలకు చెందిన ఎంపిక చేసిన విమానయాన సంస్థలు విమాన సర్వీసులు నడిపించుకోవచ్చు.


కాగా, భారత్ ఇప్పటికే 34 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాబితాలో ఆఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, భూటాన్, కెనడా, ఇథియోపియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, కువైత్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, ఖతార్, రష్యా, రువాండా, సింగపూర్, సీషెల్స్, స్విట్జర్లాండ్, శ్రీలంక, టాంజానియా, యూఏఈ, యూకే, అమెరికా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, సౌదీ అరేబియా ఉన్నాయి.


ఇదిలా ఉంటే.. ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ (డీజీసీఏ) జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, కార్గో విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందం ద్వారా నడిచే విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు ఉంది. ఇక తాజాగా కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వణికిస్తున్న వేళ సౌదీ అరేబియాతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకోవడం ఇరు దేశాల ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగించే విషయం. ముఖ్యంగా ఉమ్రా యాత్రికులు, భారత ప్రవాసులకు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. 

Updated Date - 2021-12-26T18:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising