ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీయులకు కేంద్ర హోం శాఖ గుడ్‌న్యూస్.. కానీ

ABN, First Publish Date - 2021-10-09T06:25:38+05:30

విదేశాల నుంచి భారత్ రావాలనుకుంటున్న వారికి కేంద్ర హోంశాఖ తీపికబురందించింది. ఇతర దేశాల నుంచి భారత్ రావాలనుకుంటున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్ రావాలనుకుంటున్న వారికి కేంద్ర హోంశాఖ తీపికబురందించింది. ఇతర దేశాల నుంచి భారత్ రావాలనుకుంటున్న వారిని అక్టోబర్ 15 నుంచి అనుమతులివ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే చార్టర్డ్ విమానాలలో వచ్చే వారికి మాత్రమే ఈ ఆహ్వానమని మెలిక పెట్టింది. అలా కాకుండా ప్యాసెంజర్ విమానాల నుంచి రావాలనుకునే వారికి నవంబర్ 15 నుంచి అనుమతించే అవకాశం ఉందని వెల్లడించింది.


అయితే విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలకు కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని నిబంధనలనూ పాటించాల్సిందేనని, అందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులూ లేవని తేల్చి చెప్పింది. విమానం దిగిన ప్రదేశం నుంచే ఈ నిబంధనలు అమలవుతాయని చెప్పింది.


కాగా.. ఫారెన్ టూరిస్టులను భారత్‌లోకి అనుమతిస్తూ వీసాలు అందించనున్నట్లు కేంద్ర హోం శాఖ చేసిన ప్రకటనను టూర్ ఆపరేటర్స్, ట్రావెల్ సర్వీస్‌ సంస్థల నిర్వాహకులు స్వాగతించారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. సాధారణ ప్యాసెంజర్ కమర్షియల్ విమానాలను కూడా అనుమతించాలని కోరారు. 

Updated Date - 2021-10-09T06:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising