ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో కరోనా కలకలం.. గంటకు 34 మరణాలు

ABN, First Publish Date - 2021-08-21T14:17:05+05:30

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. గురువారం ఒక్క రోజే లక్షన్నర మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా అమెరికాలో లక్షపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జపాన్‌లో ఎమర్జెన్సీ, శ్రీలంకలో లాక్‌డౌన్‌

న్యూయార్క్‌, ఆగస్టు 20: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. గురువారం ఒక్క రోజే లక్షన్నర మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా అమెరికాలో లక్షపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరింత పెరిగాయి. దీనికితగ్గట్లే మరణాలు సైతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల్లో 5,800 మంది మృతి చెందారు. రోజుకు సగటున 800 మందిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే గంటకు 34 మంది. కాగా, మొత్తం 50 రాష్ట్రాలకు 42 రాష్ట్రాల్లో మరణాలు పెరగుతున్నాయి.


కాగా, కరోనా ఉధృతితో జపాన్‌లోని చాలా ప్రాంతాల్లో సెప్టెంబరు 12 వరకు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. మరోవైపు శ్రీలంక మొత్తం లాక్‌డౌన్‌ విధించారు. ఇక ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లాక్‌డౌన్‌ సెప్టెంబరు మాసాంతం వరకు పొడిగించారు.


Updated Date - 2021-08-21T14:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising