ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమాన ఇంజిన్‌ను ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ABN, First Publish Date - 2021-03-31T15:26:51+05:30

ఓ పక్షి విమాన ఇంజిన్‌ను ఢీకొట్టడంతో ఫ్లైట్ అత్యావసరంగా ల్యాండ్ అయిన ఘటన అమెరికాలోని ఉటాలో మంగళవారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉటా: ఓ పక్షి విమాన ఇంజిన్‌ను ఢీకొట్టడంతో ఫ్లైట్ అత్యావసరంగా ల్యాండ్ అయిన ఘటన అమెరికాలోని ఉటాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉటా జాజ్ ఎన్‌బీఏ జట్టు ఆటగాళ్లను తీసుకెళ్తున్న డేల్టా చార్టర్డ్ విమానం బోయింగ్ 757 ఇంజిన్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. ఇది గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై సాల్ట్ లేక్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఎన్‌బీఏ జట్టు మంగళవారం టేనస్సీలోని మెంఫిస్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం నాటి గ్రిజ్లీస్‌తో మ్యాచ్ కోసం జాజ్ జట్టు మెంఫిస్ వెళ్తున్నట్లు తెలిసింది. విమానంలో ప్రయాణిస్తున్న కొందరు ఆటగాళ్లు ట్వీట్ చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డేల్టా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇక ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై పలువురు జాజ్ ఆటగాళ్లు తమదైన శైలిలో స్పందించారు. 'దేవుడు మంచోడు' అని రాయిస్ ఓ నీల్ ట్వీట్ చేయగా.. 'ఇది చాలా మంచి రోజు' అని రూడీ గోబెర్ట్ అన్నారు.     



Updated Date - 2021-03-31T15:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising