ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్రంలో పడవ మునక.. 12 మంది గల్లంతు !

ABN, First Publish Date - 2021-04-15T16:15:06+05:30

అమెరికాలోని లూసియానా తీరంలో ఓ పడవ సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందగా, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లూసియానా: అమెరికాలోని లూసియానా తీరంలో ఓ పడవ సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందగా, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. తుపాను వల్ల లూసియానా తీరంలోని పోర్ట్ ఫార్చూన్ ఓడరేవుకు సమీపంలో ఈ ఘటన జరిగింది. తుపాను ధాటికి 90 కిమీ వేగంతో గాలులు వీయడంతోనే పడవ మునిగిపోయినట్లు కోస్ట్‌గార్డు అధికారులు వెల్లడించారు. బోర్డింగ్ సమయంలో పడవలో మొత్తం 19 మంది ఉన్నట్లు తెలిసింది. ప్రమాద ఘటన తర్వాత 12 మంది గల్లంతు కాగా, ఆరుగురిని కోస్ట్‌గార్డు సిబ్బంది రక్షించింది. ఒకరు చనిపోయారు. ఇక లూసియానాకు దక్షిణాన ఉన్న పోర్ట్ ఫార్చూన్ ఓడరేవు.. అమెరికా చమురు, గ్యాస్ పరిశ్రమకు ఒక ప్రధాన స్థావరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-04-15T16:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising