కరోనా ఫండ్తో ఖరీదైన కార్లు కొనుగోలు చేసిన వ్యక్తి.. చివరికి!
ABN, First Publish Date - 2021-05-13T06:09:02+05:30
నకిలీ ధ్రువపత్రాలతో కొవిడ్ సహాయ నిధిని పొంది, లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన వ్యక్తి కటకటాలపాలైన ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన ముస్తఫా ఖాద్రీ కరో
కాలిఫోర్నియా: నకిలీ ధ్రువపత్రాలతో కొవిడ్ సహాయ నిధిని పొంది, లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన వ్యక్తి కటకటాలపాలైన ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన ముస్తఫా ఖాద్రీ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. అయితే అక్కడి ప్రభుత్వం చిన్న వ్యాపారులకు సహాయాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో ముస్తాఫా నకిలీ ధ్రువపత్రాలకు సృష్టించాడు. తనకు ఓ కంపెనీ ఉందని, కరోనా వల్ల నష్టపోయినట్టు తెలుపుతూ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ముస్తఫా.. కొవిడ్ సహాయ నిధిని పొందాడు. అనంతరం ఆ డబ్బుతో ఖరీదైన లంబోర్గిని, ఫెరారీ కార్లను కొనుగోలు చేశాడు. కాగా ఎక్వైరీకి కోసం అతని ఇంటికి వెళిన అధికారులు.. ఆ కార్లను చూసి కంగుతిన్నారు. అనంతరం విచారణ చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముస్తఫాపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని వద్ద ఉన్న కార్లతోపాటు 20 లక్షల డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2021-05-13T06:09:02+05:30 IST