ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాజీర్ మృతిపట్ల సంతాపం ప్రకటించిన భారత రాయబారి

ABN, First Publish Date - 2021-03-08T16:59:18+05:30

ప్రముఖ సామాజిక కార్యకర్త మృతిపట్ల కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జి సంతాపం ప్రకటించారు. సాజీర్ త్రికరిప్పూర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత ముప్పై ఏళ్లుగా సాజీర్ త్రికరిప్పూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: ప్రముఖ సామాజిక కార్యకర్త మృతిపట్ల కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జి సంతాపం ప్రకటించారు. సాజీర్ త్రికరిప్పూర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత ముప్పై ఏళ్లుగా సాజీర్ త్రికరిప్పూర్.. ఎంతో మందికి సహాయం చేసినట్లు గుర్తు చేశారు. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉండేవారని పేర్కొన్నారు. ఇండియాకు చెందిన ఐసీఎఫ్ కువైత్, జనతా కల్చర్ సెంటర్, ఎంఈఎస్ కువైత్ తదితర సంస్థలు కూడా సాజీర్ త్రికరిప్పూర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. సాజీర్ త్రికరిప్పూర్ కువైత్ కేరళ ముస్లిం అసోసియేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈయన సేవలకు గుర్తుగా 2012లో ప్రవాసీ భారతి(కేరళ) అవార్డు లభించింది. కాగా.. కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డ ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందతూ ఆదివారం రోజు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-03-08T16:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising