ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మలయప్పస్వామి ఎవరు?

ABN, First Publish Date - 2021-12-24T05:30:00+05:30

తిరుమలలో నిర్వహించే వివిధ ఉత్సవాల్లో మలయప్ప స్వామిని తిరువీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమలలో నిర్వహించే వివిధ ఉత్సవాల్లో మలయప్ప స్వామిని తిరువీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో ఊరేగింపు మలయప్ప స్వామికి జరగడం ఏమిటనే సందేహం సహజం. ఇంతకీ.... ఉత్సవమూర్తి అయిన ఈ మలయప్పస్వామి ఎవరు? తిరుమల ఆలయంలోని మూలవిరాట్టును ‘ధ్రువ బేర’ అంటారు. స్థిరమైన ఆ ప్రతిమను కదల్చకూడదు. కాబట్టి ఉత్సవాల కోసం, గర్భగుడికి బయట చేసే సేవల నిమిత్తం మరో ప్రతిమను వినియోగిస్తారు. దాన్ని ‘ఉత్సవ బేర’ అంటారు. పూర్వం ఉగ్ర శ్రీనివాసుడి విగ్రహం ‘ఉత్సవ బేర’గా ఉండేది. ఒకసారి ఊరేగింపులో మంటలు చెలరేగాయి. శాంతంగా ఉండే మూర్తిని ఉత్సవాల్లో ఉపయోగించాలని ఒక భక్తుడి ద్వారా స్వామి వెల్లడిస్తూ, అవి దొరికే చోటును కూడా చెప్పారట! ఆ మేరకు అన్వేషించగా... వంగి ఉన్న ఒక కొండ దగ్గర దేవేరులతో సహా శ్రీ వేంకటేశ్వరుడి విగ్రహాలు దొరికాయట. ఆ స్వామికి ‘మలై కునియ నిన్ర పెరుమాళ్‌’ అని పేరు పెట్టారు. అంటే ‘వంగి ఉన్న పర్వతం మీద కొలువైన వేంకటేశ్వరుడు’ అని అర్థం. ఆ పేరే మలయప్ప స్వామిగా వాడుకలోకి వచ్చింది. మలయప్ప స్వామి పంచలోహ విగ్రహాన్నే తిరుమల గర్భగుడి బయట నిర్వహించే అన్ని వేడుకలకూ, వాహన సేవలకు వినియోగిస్తారు.

Updated Date - 2021-12-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising