ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే టాలీవుడ్‌ రీ ఎంట్రీ

ABN, First Publish Date - 2021-04-25T05:30:00+05:30

మమతా మోహన్‌దాస్‌ గాయనిగా, హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. దాదాపు పదేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులకు దూరమైన మమత త్వరలోనే ఓ అనువాద చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘లాల్‌భాగ్‌’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో కూడా విడుదలవుతోన్న ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్‌లో రీ ఎంట్రీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మమతా మోహన్‌దాస్‌ గాయనిగా, హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. దాదాపు పదేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులకు దూరమైన మమత త్వరలోనే ఓ అనువాద చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘లాల్‌భాగ్‌’ అనే  మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో కూడా విడుదలవుతోన్న ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ మురళీ పద్మనాభన్‌ దర్శకుడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలె ఈ చిత్రంలో మమత ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘రాఖీ’ టైటిల్‌ సాంగ్‌, చిరంజీవి నటించిన ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’లో స్పెషల్‌ సాంగ్‌తో మమత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ సరసన ‘యమదొంగ’, వెంకటేష్‌తో ‘చింతకాయల రవి’, నాగార్జునతో ‘కేడీ’ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె కేన్సర్‌ బారిన పడి కోలుకున్నారు. ఆ సమయంలో సినిమాలకు దూరమయ్యారు. విశాల్‌, ఆర్య నటిస్తున్న తమిళ చిత్రం ‘ఎనిమీ’లో ఆమె కీలకపాత్రలో నటిస్తున్నారు. 


Updated Date - 2021-04-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising