గొప్ప గౌరవంగా భావిస్తున్నా!
ABN, First Publish Date - 2021-04-04T05:30:00+05:30
దక్షిణాది బామ రష్మిక మందన్న బాలీవుడ్లో అమితాబ్బచ్చన్తో కలసి నటిస్తోన్న చిత్రం ‘గుడ్బై’. ఇటీవల ఈ చిత్రం
దక్షిణాది బామ రష్మిక మందన్న బాలీవుడ్లో అమితాబ్బచ్చన్తో కలసి నటిస్తోన్న చిత్రం ‘గుడ్బై’. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ‘‘నా జీవితంలో అమితాబ్ బచ్చన్లాంటి గొప్ప నటుడితో కలసి నటించే అవకాశం దక్కుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆయనతో కలసి నటించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
నా కెరీర్లో చాలా త్వరగా ఈ అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది. ఆయనతో కలసి నటించాలనగానే కొంచెం గాబరా పడ్డాను. కానీ ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటాను. షూటింగ్లో పాల్గొనే రోజు కోసం ఎదురుచూస్తున్నాను. అమితాబ్ జీ నుంచి కచ్చితంగా చాలా నేర్చుకుంటాను’’ అని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ చిత్రం చేస్తున్నారు.
Updated Date - 2021-04-04T05:30:00+05:30 IST