మేడే కు కరోనా బ్రేక్!
ABN, First Publish Date - 2021-04-11T05:38:09+05:30
అజయ్ దేవ్గణ్ కీలకపాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘మేడే’ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ నిలిచిపోయింది. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అజయ్ షూటింగ్ను వాయిదా వేశారు
అజయ్ దేవ్గణ్ కీలకపాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘మేడే’ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ నిలిచిపోయింది. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అజయ్ షూటింగ్ను వాయిదా వేశారు. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్సింగ్ పైలట్లుగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ‘మేడే’ సెట్స్పైకి వెళ్లింది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరుకు ఖతార్లో మూడు రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది. కొద్ది మంది సిబ్బందితో ఖతార్ వెళ్లి చిత్రీకరణ పూర్తి చేయాలని అజయ్ దేవ్గణ్ భావించారు. అయితే కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో సిబ్బందిని రిస్క్లో పెట్టటం ఇష్టంలేక ఖతార్ షెడ్యూల్ను అజయ్ నిలిపివేశారు. పరిస్థితులు చక్కబడ్డాక నే తిరిగి షూటింగ్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారట అజయ్ దేవ్గణ్.
Updated Date - 2021-04-11T05:38:09+05:30 IST