ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీతో వసంతం వచ్చింది: రాహుల్‌తో రౌత్

ABN, First Publish Date - 2021-12-14T22:43:29+05:30

లోక్‌సభా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా ఇతర పార్టీల ప్రముఖులు రాహుల్‌కు ముందే 12 ఎంపీలు ఆందోళన చేస్తున్న గాంధీ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. ఇంతలో రాహుల్ రాగానే.. సంజయ్ రౌత్ ఎదురువెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిళించుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ‘మీరొచ్చారు.. మీతో పాటు వసంతం వచ్చింది’ అని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో రాహుల్‌ను కలిసిన సందర్భంలో రౌత్ ఈ వ్యాఖ్య చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదట్లోనే రాజ్యసభ నుంచి 12 ఎంపీలను సస్పెండ్ చేశారు. కాగా, ఆరోజు నుంచి సస్పెండ్ అయిన ఆ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. వీరిని గతంలోనే ఒకసారి కలిసి పరామర్శించిన రాహుల్ గాంధీ.. తాజాగా మరోసారి కలిసి పలకరించారు.


లోక్‌సభా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా ఇతర పార్టీల ప్రముఖులు రాహుల్‌కు ముందే 12 ఎంపీలు ఆందోళన చేస్తున్న గాంధీ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. ఇంతలో రాహుల్ రాగానే.. సంజయ్ రౌత్ ఎదురువెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిళించుకున్నారు. అనంతరం ‘మీరొచ్చారు.. మీతో పాటు వసంతం వచ్చింది’ అంటూ రాహుల్‌ను పొగిడారు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో శివసేన సన్నిహితంగా ఉంటూ వస్తోంది. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని సంజయ్ రౌత్ కలుసుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని సంజయ్ రౌత్ ఎడిటర్‌గా ఉన్న శివసేన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం రాయడం గమనార్హం.

Updated Date - 2021-12-14T22:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising