ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ధైర్యశాలి ఒక్కడే ప్రాణాలతో..

ABN, First Publish Date - 2021-12-09T08:20:18+05:30

ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే శౌర్యచక్ర అవార్డు గ్రహీత, ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గతంలో తేజస్‌కు ప్రమాదం తప్పించిన వరుణ్‌
  • ఇటీవలే శౌర్యచక్ర అవార్డుతో సత్కరించిన కేంద్రం
  • ప్రస్తుత హెలికాప్టర్‌కు ఆయనే కెప్టెన్‌


న్యూఢిల్లీ, డిసెంబరు 8: ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే శౌర్యచక్ర అవార్డు గ్రహీత, ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐఏఎఫ్‌ ట్వీట్‌ చేసింది. వరుణ్‌ మంచి ధైర్యశాలి. వాయుసేనలో విశేష సేవలందించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌కు ఆయనే కెప్టెన్‌. గతంలో సాంకేతిక సమస్యలు ఎదురైనపుడు ఆయన వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. గతేడాది అక్టోబరులో ఆయన నడుపుతున్న ఎల్‌సీఏ తేజస్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్పట్లో వింగ్‌ కమాండర్‌గా ఉన్న వరుణ్‌ ఆ సమయంలో సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు ప్రదర్శించి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం ఆయనను మూడో అత్యున్నత పురస్కారం శౌర్యచక్రతో సత్కరించింది.

Updated Date - 2021-12-09T08:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising