ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌బుక్ ద్వారా వేరే దేశస్థుడితో భార్యకు పరిచయం.. మధ్యలో భర్త అడ్డంగా ఉన్నాడని..

ABN, First Publish Date - 2021-03-08T07:38:55+05:30

బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడం కోసం ప్రియుడితో కలిసి భర్తను భార్య కిరాతకంగా హతమార్చింది. ఈజిప్టులోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిజా: బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడం కోసం ప్రియుడితో కలిసి భర్తను భార్య కిరాతకంగా హతమార్చింది. ఈజిప్టులోని గిజా నగరంలో ఈ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలస్తీనాకు చెందిన మహిళకు ఫేస్‌బుక్ ద్వారా ఈజిప్టుకు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొద్ది రోజుల తర్వాత మహిళను ఈజిప్టు రమ్మని ఆమె బాయ్ ఫ్రెండ్ కోరాడు. ఈజిప్టు ట్రిప్‌కు వెళ్దామంటూ మహిళ ఆమె భర్తను ఒప్పించి బాయ్ ఫ్రెండ్ నివసిస్తున్న గిజా నగరానికి తీసుకువెళ్లింది. భర్తకు తెలియకుండా బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. 


కొద్ది రోజుల తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. భర్త అడ్డంగా ఉండటంతో మహిళ తన భర్తను చంపేయాలని అనుకుంది. భర్తను అమానుష ప్రాంతానికి తీసుకెళ్లింది. ఇదే సమయంలో మహిళ భర్త తలపై ఆమె బాయ్ ఫ్రెండ్ గట్టి చక్కతో కొట్టాడు. దెబ్బ గట్టిగా తగలడంతో మహిళ భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతడి శవాన్ని దగ్గరలోని చెరువులో పడేసి ఇద్దరూ వెళ్లిపోయారు. భర్త మృతదేహం అధికారుల కంట పడటంతో కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడి మరణానికి కారణమైన ఇద్దరిని అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకోవడానికి అడ్డంగా ఉన్నందుకే తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చినట్టు మహిళ నేరాన్ని అంగీకరించింది. త్వరలో వీరిని అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

Updated Date - 2021-03-08T07:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising