ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ.. ప్రస్తుతం ఏ పార్టీ ఎన్ని సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయంటే..

ABN, First Publish Date - 2021-05-02T14:46:20+05:30

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆ రాష్ట్రంలో ఎలాంటి ఫలితం వస్తుందన్న ఆసక్తిని కనపరుస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆ రాష్ట్రంలో ఎలాంటి ఫలితం వస్తుందన్న ఆసక్తిని కనపరుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల ఫలితాల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది. హోరాహోరీగా పోటీ నడుస్తోందన్న ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. 9 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం మమతాబెనర్జీ పార్టీ 84 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అదే సమయంలో భారతీయ జనతాపార్టీ కూడా పోటీని ఇస్తోంది. ఆ పార్టీకి 80 స్థానాల్లో ఆధిక్యం ఉంది. వామపక్ష పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇంకా 128 స్థానాల్లో సమాచారం రావాల్సి ఉంది. కాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి మమతాబెనర్జీయే అధికారంలోకి వస్తారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. మరి ఆ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయో.. లేదో అన్నది మరికొద్ది గంటల్లోనే తేలుతుంది

Updated Date - 2021-05-02T14:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising