ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎంసీకి చరమగీతం పాడతాం : బీజేపీ

ABN, First Publish Date - 2021-01-19T19:01:43+05:30

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీని కనుమరుగు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిలిగురి: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీని కనుమరుగు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. సిలిగురిలోని జల్‌పాయ్‌గురి రైల్వే జంక్షన్‌లో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలీ ప్రసంగించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. టీఎంసీ పాలనలో హింసాత్మక రాజకీయాలు కొనసాగుతున్నాయని, బీజేపీని అడ్డుకునే ఎత్తుగడలు వేసిన ప్రతిసారి ఆ పార్టీ బలహీన పడుతూ వస్తోందని అన్నారు. బీజేపీతోనే పశ్చిమబెంగాల్‌లో మార్పు సాధ్యమని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీని దాదాపు సగానికి సగం తగ్గించామని, 2021 ఎన్నికల్లో ఆ పార్టీని పూర్తిగా కనుమరుగు చేస్తామని చెప్పారు.


కాగా, కోల్‌కతాలో మంగళవారం ఉదయం జరిగిన బీజేపీ ర్యాలీపై కొందరు రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకుంది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి, దిలీప్ ఘోష్, బీజేపీ నేత సువేందు అధికారి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T19:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising