ఛార్ధామ్ భక్తులకు శుభవార్త.. పరిమితిని ఎత్తివేసిన హైకోర్టు
ABN, First Publish Date - 2021-10-07T01:35:42+05:30
ఛార్ధామ్ భక్తులకు శుభవార్త.. పరిమితిని ఎత్తివేసిన హైకోర్టు
డెహ్రాడూన్: చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఛార్ ధామ్ యాత్రకు వచ్చే రోజూవారీ భక్తుల పరిమితిని ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేసిన నేపథ్యంలో కొత్త స్టాండర్డ్ విధానాన్ని ప్రభుత్వం జారీ చేసింది. భక్తులు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిగా తీసుకున్న సర్టిఫికెట్ కానీ, 72 గంటలకు మించకుండా కోవిడ్ నెగటివ్ రిపోర్టు చూపించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఛార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు http://smartcitydehradun.uk.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
Updated Date - 2021-10-07T01:35:42+05:30 IST