ఉత్తరాఖండ్లో ఆగస్టు 4 వరకూ కర్ఫ్యూ పొడిగింపు!
ABN, First Publish Date - 2021-07-27T12:47:34+05:30
ఉత్తరాఖంఢ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేటు కార్యాలయాలను...
డెహ్రాడూన్: ఉత్తరాఖంఢ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేటు కార్యాలయాలను వందశాతం సిబ్బందితో తెరుచుకునేందుకు అనుమతి నిచ్చింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుఖవీర్ సింగ్.. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గానూ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్పాలు, సెలూన్లను 50శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతినిచ్చారు. దీనికి ముందు జిమ్లు, షాపింగ్మాల్స్, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ సెంటర్లు, పార్కులు, థియేటర్లు, ఆడిటోరియంలు మొదలైనవాటిని 50శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతినిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రాత్రి కర్ఫ్యూను ఆగస్టు 4 వరకూ కొనసాగించనున్నారు.
Updated Date - 2021-07-27T12:47:34+05:30 IST