యూపీలో తెరుచుకున్న స్కూళ్లు... కరోనా గైడ్లైన్స్ తప్పనిసరి!
ABN, First Publish Date - 2021-08-24T16:20:28+05:30
కరోనా కేసులు భారీగా తగ్గుతున్న నేపధ్యంలో...
లక్నో: కరోనా కేసులు భారీగా తగ్గుతున్న నేపధ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లను తిరిగి తెరుస్తున్నారు. అదికూడా ఫిజికల్ మోడ్లో తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో యూపీలో ఈరోజు నుంచి ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకూ పాఠశాలలు తెరుచుకున్నాయి.
నిజానికి సోమవారం నుంచే పాఠశాలలు తెరవాల్సి ఉన్నప్పటికీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతి కారణంగా సెలవు ప్రకటించినందున పాఠశాలలు తెరవలేదు. దీంతో ఈరోజు నుంచి అన్ని స్కూళ్లను తెరిచారు. కాగా రాష్ట్రంలో 9 నుంచి 12 వరకూ గల తరగతులను ఆగస్టు 16 నుంచే నిర్వహిస్తున్నారు.
Updated Date - 2021-08-24T16:20:28+05:30 IST