ఉగ్రవాదం కూడా కరోనా లాంటిదే: విదేశాంగ శాఖ మంత్రి
ABN, First Publish Date - 2021-08-20T05:09:53+05:30
ఉగ్రవాదం కూడా కరోనా లాంటిదేనని భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తాజాగా వ్యాఖ్యానించారు.
వాషింగ్టన్: ఉగ్రవాదం కూడా కరోనా లాంటిదేనని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తాజాగా వ్యాఖ్యానించారు. మనలో ఒక్కరు అపాయంలో ఉన్నా మనమందరం ప్రమాదంలో ఉన్నట్టేనని తేల్చి చెప్పారు. గురువారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లష్కరే తయ్యబా, జైషే మహ్మద్ లాంటి సంస్థలు తమకు శిక్షపడుతుందన్న భయమే లేకుండా తమ కార్యకలాపాలను ఇనుమడించిన ఉత్సాహంతో కొనసాగిస్తున్నాయి అని ఆయన ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఉగ్రవాదం అణచివేత విషయంలో భద్రతామండలి ఏమరపాటుగా ఉండకూడదని కూడా సూచించారు.
Updated Date - 2021-08-20T05:09:53+05:30 IST