ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం ఉద్ధవ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు..మంత్రి రాణేపై మరో కేసు

ABN, First Publish Date - 2021-08-24T15:37:38+05:30

కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై పూణే పోలీసులు మరో కేసు నమోదు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణే(మహారాష్ట్ర): కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై పూణే పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై నారాయణ్ రాణే అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీంతో యువసేన ఫిర్యాదు మేర రాణేపై పూణే నగరంలోని చతుర్ శృంగి పోలీసులు ఐపీసీ సెక్షన్ 153, 505 కింద మరో కేసు నమోదు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రసంగంలో స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరాన్ని మర్చిపోయారని  రాణే ఆరోపించారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం గురించి సీఎంకు తెలియకపోవడం సిగ్గుచేటు, సంవత్సరం గురించి ఆరా తీసేందుకు సీఎం వెనుతిరిగారు,  నేను అక్కడ ఉంటే గట్టి సమాధానం చెప్పేవాడిని’’ అని రాణే వ్యాఖ్యానించారు.మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాణేపై నాసిక్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి, అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం.మొత్తం మీద కరోనా నిబంధనల ఉల్లంఘనతో పాటు సీఎంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాణేపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2021-08-24T15:37:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising