ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్య రామ భక్తులకు మరొక సదుపాయం : కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2021-03-09T23:14:08+05:30

శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో అత్యాధునిక విమానాశ్రయం అందుబాటులోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో అత్యాధునిక విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. దీనికోసం రూ.242 కోట్లు మంజూరయ్యాయి. ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే శ్రీరాముని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు చాలా సదుపాయంగా ఉంటుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి మంగళవారం ఈ వివరాలు తెలిపారు. 


హర్‌దీప్ సింగ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, శ్రీరాముని జన్మభూమి అయోధ్యకు పౌర విమానయానం అనుసంధానంపై శుభవార్త చెప్తున్నానన్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అయోధ్యలో అత్యాధునిక విమానాశ్రయం నిర్మాణం కోసం రూ.242 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ విమానాశ్రయం భక్తులకు, సందర్శకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు చెప్తున్నానన్నారు. తొలి దశ కార్యకలాపాల కోసం సుమారు 270 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు మరొక 558 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. 


Updated Date - 2021-03-09T23:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising