Jan Ashirwad Yatra: గిరిజనులతో కలిసి కేంద్ర మహిళా మంత్రి డాన్స్
ABN, First Publish Date - 2021-08-17T17:08:32+05:30
జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి భారతీ పవార్ గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసి అలరించారు....
పాల్ఘార్ : జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి భారతీ పవార్ గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసి అలరించారు.మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి భారతీ పవార్ సంప్రదాయక దుస్తులు ధరించి గిరిజన మహిళలతో కలిసి పది నిమిషాల పాటు డాన్స్ చేశారు. గిరిజనులు పాడిన సంప్రదాయ పాటలకు చేతులతో చప్పట్లు కొడుతూ గిరిజన మహిళలతో చేతులు కలిపి నృత్యం చేశారు. జనఆశీర్వాద్ యాత్రలో భారతీతో పాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు కపిల్ పాటిల్, భగవత్ కరద్, బీజేపీ ఎమ్మెల్యే మనీషా చౌదరి, మహారాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ప్రవీణ్ దారేకర్, పాల్ఘార్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నంద్కుమార్ పాటిల్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-17T17:08:32+05:30 IST