ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెప్టెంబరులో ఆహార ధరలు తగ్గాయి!

ABN, First Publish Date - 2021-10-13T02:15:34+05:30

ఆహారం ధరలు తగ్గడంతో సెప్టెంబరులో రిటెయిల్ ద్రవ్యోల్బణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆహారం ధరలు తగ్గడంతో సెప్టెంబరులో రిటెయిల్ ద్రవ్యోల్బణం బాగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రిటెయిల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.30 శాతం కాగా, సెప్టెంబరులో 4.35 శాతానికి తగ్గిందని తెలిపింది. ఆహారం ధరలు ఆగస్టులో 3.11 శాతం స్థాయిలో ఉండగా, సెప్టెంబరులో 0.68 శాతం స్థాయికి తగ్గినట్లు పేర్కొంది. గుడ్లు, మాంసం, చేపలు, పండ్లు, కూరగాయల ధరలు సెప్టెంబరులో బాగా తగ్గినట్లు తెలిపింది. 


వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ప్రకారం 2020 సెప్టెంబరునాటి రిటెయిల్ ద్రవ్యోల్బణం 7.27 శాతం ఉండేది. ఈ ఏడాది సెప్టెంబరులో ఇది 4.35 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం 2020 సెప్టెంబరులో 10.68 శాతం ఉండేది. ఈ ఏడాది సెప్టెంబరులో 0.68 శాతం స్థాయికి తగ్గింది. 


సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలో 6 శాతం కన్నా తక్కువగా నమోదైంది. ఇది 2021 జూలైలో 5.59 శాతం, ఆగస్టులో 5.30 శాతం, సెప్టెంబరులో 4.35 శాతం నమోదైంది. 


Updated Date - 2021-10-13T02:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising