ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉగ్రవాద దాడి... ఇద్దరు సైనికుల మృతి...

ABN, First Publish Date - 2021-11-28T22:47:50+05:30

పాకిస్థాన్‌లోని కల్లోలిత ప్రాంతం ఉత్తర వజీరిస్థాన్‌లో ఉన్న ఓ భద్రతా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెషావర్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత ప్రాంతం ఉత్తర వజీరిస్థాన్‌లో ఉన్న ఓ భద్రతా చెక్ పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ చెక్‌ పోస్టులోని సైనికులు వెంటనే అప్రమత్తమై ప్రతిస్పందించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. 


పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం తెలిపిన వివరాల ప్రకారం, ఖైబర్ పక్తూన్‌ఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లా, దత్త ఖేల్ తహశీల్‌లో శనివారం ఈ ఉగ్రవాద దాడి జరిగింది. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు పారిపోయారు. ఈ సంఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తమ పనేనని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదు. 


పాకిస్థాన్ ప్రభుత్వం, నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఓ నెలపాటు కాల్పుల విరమణ అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం నవంబరు 9 నుంచి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ, ఇప్పటికి మూడుసార్లు భద్రతా దళాలపై కాల్పులు జరిగాయి. ఇంతకుముందు బజౌర్ జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసులు, టంక్ జిల్లాలో జరిగిన దాడిలో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-11-28T22:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising