ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారంపై నిరసన...200 మంది మహిళా కార్మికుల తొలగింపు

ABN, First Publish Date - 2021-11-27T17:55:05+05:30

సహోద్యోగిపై అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారని జార్ఖండ్‌ రాష్ట్రంలో 200 మంది మహిళా కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంషెడ్‌పూర్ (ఝార్ఖండ్): సహోద్యోగిపై అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారని జార్ఖండ్‌ రాష్ట్రంలో 200 మంది మహిళా కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించారు.తూర్పు సింగ్‌భూమ్‌కు చెందిన దాదాపు 200 మంది మహిళా కార్మికులను ఉద్యోగాల నుంచి అకస్మాత్తుగా తొలగించారు. ఓ మహిళా కార్మికురాలిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా తోటి మహిళా కార్మికులు ఆందోళన చేశారు.ధాల్‌భూమ్‌గఢ్‌లో నవంబర్ 19న కంపెనీ ఫ్లోర్ షాప్ మేనేజర్ ఓ మహిళను తన గదికి పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ బాధిత మహిళ సహోద్యోగులకు తన గోడును వివరించింది.దీంతో నిందితుడిపై చర్య తీసుకోవాలని మహిళలు యాజమాన్యాన్ని ఆశ్రయించారు. 


‘‘కానీ యాజమాన్యం నిందితుడిపై చర్య తీసుకోకుండా, యాజమాన్యం మమ్మల్ని మా ఉద్యోగాల నుంచి తొలగించింది’’  అని ఓ కార్మికురాలు చెప్పారు.కంపెనీ తమకు సరైన జీతం ఇవ్వడం లేదని, సరైన భోజనం కూడా పెట్టడం లేదని మహిళా కార్మికులు ఆరోపించారు.కాగా రాష్ట్ర కార్మిక శాఖ అధికారులకు ఈ విషయం తెలియజేశామని, వారు దీనిపై విచారణ జరుపుతున్నారని ఘట్‌శిల ఎమ్మెల్యే రాందాస్ సోరెన్ చెప్పారు. 


Updated Date - 2021-11-27T17:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising