భారత్కు రూ.110 కోట్ల ట్విట్టర్ సాయం!
ABN, First Publish Date - 2021-05-11T15:46:27+05:30
కరోనా సెకెండ్ వేవ్తో పోరాడుతున్న భారతదేశానికి...
న్యూఢిల్లీ: కరోనా సెకెండ్ వేవ్తో పోరాడుతున్న భారతదేశానికి సాయం అందించేందుకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ముందుకొచ్చింది. 15 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 110 కోట్లు విరాళం అందించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ డోర్సే ట్వీట్ చేశారు. ఈ మొత్తాన్ని భారతదేశానికి ఎలా అందజేయనున్నామనేది కూడా తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థలైన కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎలకు ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
Updated Date - 2021-05-11T15:46:27+05:30 IST