సీఎం మార్పు సంగతి నాకు తెలియదు: త్రివేంద్ర రావత్
ABN, First Publish Date - 2021-03-09T00:37:43+05:30
ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించనున్నారనే వార్తలపై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర..
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించనున్నారనే వార్తలపై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్పందించారు. మీడియాలో వార్తల గురించి తనకు తెలియదని అన్నారు. పార్టీ అధిష్ఠానాన్ని కలిసేందుకు సమయం అడిగానని, ఎప్పుడు వాళ్లు పిలిస్తే అప్పుడు వెళ్లి కలుస్తానని మీడియాకు చెప్పారు.
త్రివేంద్ర రావత్ సోమవారంనాడు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడంతో నాయకత్వం మార్పుపై చర్చించేందుకే అధిష్ఠానం ఆయనను పిలిపించిదంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే, ఇది రొటీన్ పర్యటనలో భాగమేననంటూ ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి. రావత్ నాయకత్వంపై పార్టీ ఎమ్మెల్యేలు పలువురు అసంతృప్తితో ఉన్నారని, కేబినట్ కూర్పు జాప్యం కావడం కూడా ఆయనపై ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణమని చెబుతున్నారు. దీనిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్ సైతం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులను పిలిచి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు.
Updated Date - 2021-03-09T00:37:43+05:30 IST