ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

enounter: షోపియాన్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN, First Publish Date - 2021-07-19T12:42:53+05:30

జమ్మూకశ్మీరులోని షోపియాన్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షోపియాన్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని షోపియాన్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ ప్రాంతంలోని సాథిక్ ఖాన్ ఏరియాలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర సోమవారం తెల్లవారుజామున కేంద్ర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. గాలిస్తున్న జవాన్లపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారరు. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మృతుల్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండరు ఇష్ఫాఖ్ దార్ అలియాస్ అబూ అక్రం ఉన్నారని, ఇతను 2017 వ సంవత్సరం నుంచి ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నాడని కశ్మీర్ పోలీసు ఐజీ విజయకుమార్ చెప్పారు. 



ఉగ్రవాదుల మృతదేహాల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఐజీ విజయ్ కుమార్ సోమవారం ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల కోసం సోమవారం ఇంకా గాలింపు కొనసాగుతుందని ఐజీ చెప్పారు. శుక్రవారం శ్రీనగర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు మరణించారు. శ్రీనగర్ ప్రాంతంలో ఈ ఏడాది మూడు ఎన్ కౌంటర్లు జరిగాయి. సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది జమ్మూకశ్మీరు లోయలో జరిగిన ఎదురుకాల్పుల్లో 78 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 

Updated Date - 2021-07-19T12:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising