Haiti: భూకంపంలో 1297కు పెరిగిన మృతుల సంఖ్య
ABN, First Publish Date - 2021-08-16T13:13:53+05:30
కరీబియన్ దీవి హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 1297కు పెరిగింది....
లెస్ కెయిస్: కరీబియన్ దీవి హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 1297కు పెరిగింది.భూకంపం వల్ల ఒక్క దక్షిణ దీవిలోనే 500 మంది మరణించారు.మరో 2,800 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2868 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మరో 5,410 ఇళ్లు దెబ్బతిన్నాయని హైతీ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధిపతి జెర్రీ చండలర్ చెప్పారు. దేశవ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. శిధిలాల కింద వందలాదిమంది చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. క్షతగాత్రులకు సత్వరం వైద్యం అందిస్తున్నామని కరీబియన్ దీవి ప్రధానమంత్రి ఏరియల్ హెన్రీ చెప్పారు. సెయింట్ లూయీస్ డు సూద్ కు 12 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం 10 కిలోమీటర్ల లోతు వరకు ఉందని అధికారులు గుర్తించారు.
Updated Date - 2021-08-16T13:13:53+05:30 IST