ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు సీఎం పళనిస్వామి రాజీనామా.. ఆమోదించిన గవర్నర్..

ABN, First Publish Date - 2021-05-04T01:38:13+05:30

తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి రాజీనామా చేశారు. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి రాజీనామా చేశారు. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇప్పటికే ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్‌భవన్ వెల్లడించింది. ‘‘ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి, ఆయన మంత్రి మండలి రాజీనామాలను తమిళనాడు గవర్నర్ ఆమోదించారు. 3.5.2021 మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వచ్చింది...’’ అని రాజ్‌భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ముఖ్యమంత్రి, మంత్రి మండలి కొనసాగాలని పళనిస్వామిని గవర్నర్ కోరినట్టు తెలిపింది. ‘‘తమిళనాడు 15వ శాసన సభను గవర్నర్ రద్దు చేశారు...’’ అని కూడా రాజ్‌భవన్ వెల్లడించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గానూ 133 స్థానాలు గెలుచుకున్న డీఎంకే.. అన్నాడీఎంకే నుంచి అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకేకి 66 స్థానాలు మాత్రమే దక్కాయి.  

Updated Date - 2021-05-04T01:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising